Tuesday, April 23, 2024

Breaking: బస్సును ఢీకొట్టిన లారీ… 13మందికి గాయాలు

కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో.. 13మందికి గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పూతలపట్టు మండలం టి.రంగంపేట ఫ్లైఓవర్ వద్ద ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు తిరుపతి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement