Wednesday, May 15, 2024

Nalgonda | స్పీకర్‌‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సామెల్

మోత్కూర్, (ప్రభ న్యూస్) : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కు.. గురువారం నిర్వహించిన అసెంబ్లీలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించి స్పీకర్ గా ఎంపిక చేయడం పట్ల అదే సామాజిక వర్గానికి చెందిన తాను ఎమ్మెల్యే గా గర్వపడుతున్నానని సభా ముఖంగా తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని ఎమ్మెల్యే సామెల్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ,శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement