Friday, April 26, 2024

కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభాలు జరగాలి : మంత్రి ఎర్రబెల్లి

నూతన సంవత్సరం సందర్భంగా సతీమణి ఉషా దయాకర్‌తో కలసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభాలు జరగాలని, సంతోషంగా ఉండాలని యాదాద్రి ల‌క్ష్మీనారసింహ స్వామిని కోరుకున్నట్లు ఆయ‌న తెలిపారు. తిరుపతితో సమానంగా యాదాద్రి ఆలయం అభివృద్ధి జరిగిందని, ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందుకు పోతుందని తెలిపారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని సీఎం బాగా అభివృద్ధి చేశారని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement