Thursday, April 18, 2024

రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి.. మంత్రి త‌ల‌సాని

నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. ఆదివారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తనను కలిసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ రవీందర్ యాదవ్, ఇండస్ట్రియల్ కార్పోరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మినారాయణ, మహంకాళి, గోపాలపురం ఏసీపీ లు రమేష్, సుధీర్, సీఐ లు శ్రీనివాస్, ముత్తు యాదవ్, సైదులు, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇతర అధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి :
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద ఆవిష్కరించారు. ముందుగా మంత్రిని ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈఓ అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement