Tuesday, May 7, 2024

జాతీయ జూనియర్‌ కబడ్డీ టోర్నీ.. కూలిన గ్యాలరీ: పలువురికి గాయాలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 47 జాతీయ జూనియర్‌ కబడ్డీ టోర్నీ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సుమారు 2 వేల మంది గ్యాలరీ కూర్చున్నట్లు సమాచారం .క్రీడాపోటీలను వీక్షించేందుకు స్టేడియంలో మూడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు. మరికాసేపట్లో పోటీలు ప్రారంభకానుండగా ఊహించని ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. క్షతగాత్రులను 108 సిబ్బంది, పోలీసులు, స్థానికులు అందుబాటులో ఉన్న వాహనాల్లో హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప దవాఖానలకు తరలించారు. బాధితులను ఏరియా దవాఖాన లో పరామర్శించారు మంత్రి జగదీశ్‌ రెడ్డి . ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు .

కాగా, పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చున్న కారణంగానే గ్యాలరీ కూలిందని చెప్పారు ఎస్పీ భాస్కరన్‌. గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నాం. పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్‌కు తరలిస్తున్నామని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement