Thursday, May 2, 2024

అభ్య‌ర్ధులు దొర‌క‌కే బ‌య‌ట వారు వ‌స్తున్నారు – విప‌క్షాల‌పై జానారెడ్డి సెటైర్

నల్లగొండ: ఎక్కడి నుంచో వచ్చి దారి డొంక తెలియని వాళ్లు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, వారు త‌న‌ను ఏమీ చేయలేరని కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల నేప‌థ్యంలో నేడు జ‌రిగిన‌ హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విలువలు, నైతికత, ప్రజాస్వామ్యం బతకడం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ తెచ్చింది ఒక్క కేసీఆర్ కాద‌ని. అప్పటి హై కమాండ్‌ను ఒప్పించడంలో త‌న‌కు భాగం ఉందని చెప్పుకున్నారు. ఈనెల 27న నాగార్జుల‌న సాగ‌ర్ లో జ‌ర‌గనున్న‌ జనగర్జన బహిరంగ సభకు బైకు ర్యాలీగా కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement