Friday, May 10, 2024

తండ్రి కోసం కొడుకు… ప్రగతి భవన్ కు ఈటెల

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ కు మంత్రి ఈటెల రాజేంద్ర చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా హడలెత్తించినట్టు తెలుస్తుంది. క‌రీంన‌గ‌ర్ జిల్లా వీణ‌వంక‌లో మంత్రి ఈటెల వ్యాఖ్యలు చెయ్యటం… ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఈటెల‌ను వెంట‌బెట్టుకొని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వెళ్ల‌టం హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు గత కొంత కాలంగా ఈటెల‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు దూరంగా ఉంచుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఈటెల కూడా రెబల్ గా మారే పరిస్థితులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రాజీమార్గం కోసం రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే, సీఎం కేసీఆర్ సూచ‌న‌తోనే కేటీఆర్ ఈటెల‌ను వెంట బెట్టుకుని ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో కేసీఆర్-ఈటెల‌-కేటీఆర్ స‌మావేశం కాబోతున్నార‌ని తెలుస్తుంది.మరి ఈటెల ఏం కేటీఆర్ మాట వింటాడో లేదో చూడాలి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ ఎంతో సున్నిత మనసు, అందరిని కలుపుకుపోయే తత్వం ఉన్న ఈటెల ఇలా మాట్లాడటం ఆలోచించాల్సిన విషయం అంటూ ట్విట్టర్ వేదికగా మాట్లాడారు.కేసీఆర్ ఎంత హింస పెడితే ఇలా ఈటెల మాట్లాడుతారో అర్ధం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement