Monday, May 6, 2024

జ‌డ్పీ ఛైర్ ప‌ర్స‌న్ త‌న‌యుడి సేవ‌లో బాడీ గార్డ్ – విచార‌ణ‌కు ఎస్సీ ఆదేశం..

సంగారెడ్డి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వం తనకు కేటాయించిన గన్‌మెన్‌ను తనయుడు జయంత్ రెడ్డికి వినియోగించారు. జ‌యంత్ షాపింగ్ మాల్ కు వెళ్లిన స‌మ‌యంలో ఆమె బాడీ గార్డ్ అత‌డిని వెన్నంటి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.. దీంతో మంజుశ్రీ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.. దీనిపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ, బాడీ గార్డ్ ను విధుల నుంచి తప్పించామ‌ని, శాఖ‌ప‌ర‌మైన చ‌ర్య‌లకు షోకాజ్ నోటీస్ జారీ చేశామ‌ని చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement