Thursday, May 2, 2024

NLG: గ్రామపంచాయతీ కార్మికుల వంటావార్పు..

మోత్కూర్, ఆగస్టు 3 (ప్రభ న్యూస్) : గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా గురువారం 29వ రోజు స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట వంటా-వార్పు నిర్వహించి వినూత్నంగా నిరసన తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు సూరారం భాస్కర్, నాయకులు మర్రిపల్లి బంగారి, కృష్ణ వేముల సుదర్శన్, సూరారం బిక్షమయ్య, పి సైదులు, పరశురాములు, అంజయ్య, సోమయ్య, యాదయ్య, శివరాజు, ఎల్లమ్మ, బుగ్గమ్మ, యాదయ్య, స్వామి, ధనుంజయ్, మల్లయ్య ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement