Tuesday, April 30, 2024

Sports | కశ్యప్​పై విజయం.. ఆస్ట్రేలియా ఓపెన్​ క్వార్టర్​ ఫైనల్స్​కి సింధూ..

భారత స్టార్​ షట్లర్‌ పీవీ సింధు గురువారం జరిగిన మ్యాచ్​లో ఆస్ట్రేలియా ఓపెన్‌ 2023లో క్వార్టర్‌ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. రెండుసార్లు ఒలింపిక్స్ పతక విజేత సింధు, కశ్యప్‌పై 16వ రౌండ్‌లో రెండు వరుస సెట్లలో గెలిచి క్వార్టర్​ ఫైనల్స్​కి వెళ్లింది. 21-14తో ఆమె తొలి గేమ్‌ను సునాయాసంగా చేజిక్కించుకుంది. కశ్యప్‌ను ఎదుర్కోవడం సింధుకు పెద్దగా సవాల్‌ అనిపించలేదు. 21-10 ఆధిపత్యంతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

ఆస్ట్రేలియా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్స్ లో ఆమె అమెరికన్‌ షట్లర్‌ బీవెన్‌ జాంగ్‌తో తలపడనుంది. సింధు 17వ ర్యాంక్‌లో కొనసాగడంతో పోటీలో మరింత ముందుకు వెళ్లాలని చూస్తోంది. వారం క్రితం సింధు జపాన్ ఓపెన్ 2023 నుండి రౌండ్ ఆఫ్ 32 లో ఓటమితో నిరాశకు గురయ్యింది. వరుస సెట్లలో పరాజయం పాలైన సింధు ఆ రోజు తన ప్రత్యర్థి జోరుతో సరిపెట్టుకోవడం కష్టమైంది. యిమాన్ సునాయాసంగా విజయం సాధించగా, పాయింట్లు తీయడానికి సింధు చాలా కష్టపడింది. ఆసియా క్రీడల లో సింధు తన 12 BWF టోర్నమెంట్‌లలో ఆరింటిలో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించింది.

ఈ నెలలో సింధు కొరియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుండి చైనీస్ తైపీకి చెందిన పై యు పో చేతిలో 18-21, 21-10, 13-21 58 నిమిషాల్లో ఓడిపోయింది. సింధు నిరుత్సాహకర ఆటతీరుతో ఆమె BWF ప్రపంచ ర్యాంకింగ్స్ లో 17వ స్థానానికి పడిపోయింది. ఈ పదేండ్లలో సింధు అత్యంత దారుణమైన డౌన్​పాల్​ ఎదుర్కొంది. 2016లో అత్యధిక ర్యాంకింగ్ టాప్​–2లో  ఉండేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement