Thursday, May 2, 2024

Jana Sena – మూడో విడ‌త ప‌వ‌న్ వారాహి విజ‌య‌ యాత్ర – విశాఖ నుంచి ప్రారంభం..

మంగ‌ళ‌గిరి – జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడో విడ‌త వారాహి విజయ యాత్ర విశాఖపట్నం నగరం నుంచి మొదలవుతుంది. ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.

గురువారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ “ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగింది. అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలి. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలి. యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం విశాఖలో ఉంటుంది. అదే విధంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కళ్యాణ్ సమావేశమై సమస్యలను తెలుసుకుంటారు” అన్నారు. త్వ‌ర‌లోనే మూడో విడ‌త వారాహి విజ‌య‌యాత్ర రూట్, తేదీల షెడ్యూల్ ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement