Friday, May 10, 2024

భారీగా బంగారం పట్టివేత..

భువనగిరి : భారీగా బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా భారీగా బంగారం పట్టుబడింది. రూ.12 కోట్ల విలువైన 26 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుంచి చెన్నైకి తీసుకెళ్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంగారాన్ని చెన్నైలో  డెలివరీ చేయాలంటూ మాఫియా ముఠాకు అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కారు ఎయిర్‌బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. విదేశాల నుంచి బంగారం ఎలా వచ్చింది? హైదరాబాద్‌లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement