Wednesday, May 8, 2024

నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి

తిరుపతి పార్లమెంట్ స్థానం ఉపఎన్నికకు తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మీ నామినేషన్ దాఖలు చేశారు. నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నెల్లూరు కలెక్టరేట్‌లో రెండు సెట్ల నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో నామినేషన్ వేసినట్లు పనబాక లక్ష్మీ తెలిపారు.

కాగా వైసీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మృతి చెందడంతో ఏప్రిల్ 17న తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. దీని కోసం ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఈనెల 31న నామినేషన్‌ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement