Wednesday, May 1, 2024

కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి

నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు ఓ కంపెనీలో గత నెల 24న జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతూ జార్ఖండ్‌కు చెందిన బల్దేవ్ అనే కార్మికుడు మరణించాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురు కార్మికులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే లక్ష్మారెడ్డి అనే బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత నెల కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఏడుగురు కార్మికులు గాయపడ్డ విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement