Tuesday, April 30, 2024

దంప‌తుల దారుణ హ‌త్య‌…

నల్గొండ: నేరుడుగొమ్ము మండ‌లంలోఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంపతుల‌ను అర్ధరాత్రి దుండగులు దారుణంగా నరికి హ‌త్య చేశారు. వివ‌రాల‌లోకి వెళితే. మండ‌లంలోని బుగ్గ‌తండాకు చెందిన బుల్లి, నేనావ‌త్ సోమాని.. భార్యభ‌ర్త‌లు. ఆదివారం రాత్రి వారు త‌మ ఇంటి ఆరుబ‌య‌ట నిద్రిస్తుండ‌గా గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు వారిని హ‌త్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దంప‌తుల హ‌త్య‌కు భూవివాదాలే కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు.‌

Advertisement

తాజా వార్తలు

Advertisement