Tuesday, May 7, 2024

ఏపీకి చల్లని కబురు

ఎండలతో సతమతమౌతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఏపీలోని ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో సోమవారం పొడి వాతావరణం ఉంటుందని, మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి తాజాగా ఝార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక వరకు వ్యాపించిందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement