Friday, April 19, 2024

కాదేదీ దోపిడీకి అనర్హం – వైసీపీ నేతలపై లోకేష్ ఆగ్రహం

ఏపీలో రాజకీయం తారాస్థాయికి చేరుకుంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా నారా లోకేష్ వైసీపీ నేతల పై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం… నవరత్నాలు అని చెబుతూ ప్రజలు కళ్ళు గప్పి మాయం చేస్తుంటే అదే అదనుగా వైసీపీ నేతలు ఇసుక మట్టి మొదలుకొని ఎర్రచందనం వరకుకాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు దోచుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా అలెగ్జాండరైట్ రంగురాళ్ల అక్రమ తవ్వకం బయటపడింది.విశాఖజిల్లా, గొలుగొండ మండలంలో నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు అత్యంత విలువైన అలెగ్జాండరైట్ రంగురాళ్ల కోసం సాలికమల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ లో జేసీబీలను పట్టుకుని వెళ్ళి మరీ యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. అటవీ సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారంటే ఎంత బరి తెగింపో చూడండి! ఇంకా క్రూరంగా వైసీపీ నేతలు వాళ్ళ స్వార్థం కోసం చిన్నారులతో అడవుల్లో ప్రమాదకరమైన సొరంగాలు తవ్వి స్తున్నారు.

ఆ పిల్లలకు ఏమైనా జరిగితే బాద్యులెవరు? ఒకవైపు అక్రమ తవ్వకం, మరోవైపు మైనర్ల ప్రాణాలతో చెలగాటం..ఈ నేరాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? అంటూ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement