Friday, May 3, 2024

కల్నల్ సంతోష్ బాబు త్యాగం చిరస్మరణీయం : మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, ప్రభ న్యూస్ : దివంగత కల్నల్ సంతోష్ బాబు త్యాగం చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కల్నల్ సంతోష్ బాబు మూడో వర్ధంతిని సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. దేశం కోసం త్యాగం చేసిన దివంగత సంతోష్ బాబు వర్తమానానికి స్ఫూర్తి దాయాకంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ బాబు కుటుంబ సభ్యులు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంవిసి పుట్ట కిషోర్, ఎంపీపీ రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ జీడి బిక్షం, ఉప్పల ఆనంద్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, కెక్కిరెని నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement