Thursday, May 2, 2024

NLG: చింతపల్లి సాయినాధుని సేవలో కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

చింతపల్లి, ఆగస్టు 26, (ప్రభ న్యూస్) : చింతపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతపల్లి మండలంలో కోటి మొక్కల ప్లాంటేషన్ ప్రోగ్రాంకు విచ్చేసిన సందర్భంగా కలెక్టర్ సాయిబాబా దేవాలయానికి వెళ్లి పూజలు చేశారు.

ఆలయ కమిటీ చైర్మన్ మంచికంటి ధనుంజయ కలెక్టర్ కు ఘన స్వాగతం పలికి ఆలయంలో గోపూజ తోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయినాధుని శాలువాతో సత్కరించి సాయిబాబా చిత్రపటం ఇచ్చి ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement