Friday, May 17, 2024

కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్సకు ఎమ్మెల్యే వసంత చేయూత

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో -గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చిన హామీని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు నెరవేర్చారు. కిడ్నీ సంభందిత వ్యాధితో బాధపడుతున్న బాధితునికి చేయూతనందించారు. బాధితునికి రూ.5లక్షల ఎల్.ఓ.సి అందజేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జి.కొండూరు మండలంలోని కవులూరు గ్రామానికి చెందిన తొండెపు వెంకట సత్యనారాయణ కిడ్నీ సంభందిత వ్యాధితో బాధపడుతూ గత 7 మాసాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇతనికి కిడ్నీ మార్పిడి అవసరం అని వైద్యులు నిర్ధారించారు. అతని మాతృమూర్తి కిడ్నీని తన కుమారునికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి శస్త్రచికిత్సల నిమిత్తం లక్షల్లో ఖర్చు అవుతోంది.తమకు ఆర్థికసాయం చేయాలని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కవులూరు గ్రామంలో పాల్గొన్న వసంత వెంకట కృష్ణప్రసాదుకి బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది.

దీనిపై స్పందించిన శాసనసభ్యుడు రాష్ట్రప్రభుత్వం నుంచి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్రచికిత్సకు చేయూతనందించారు. రూ.5 లక్షలను లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి)ని శనివారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, కవులూరు గ్రామ వైసీపీ కుటుంబ సభ్యులు శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement