Thursday, May 2, 2024

MBNR: నాగర్ కర్నూల్ లో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మర్రి

నాగర్ కర్నూల్, జిల్లా ప్రతినిధి, ఆగస్టు 26 (ప్రభ న్యూస్) : మర్రి పదేళ్ళ ప్రజా ప్రస్థానంలో భాగంగా నాగర్ కర్నూల్ నివెజకవర్గం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. శనివారం జిల్లా కేంద్రంలో గల తెలకపల్లి మండలంలోని గౌరారం గ్రామంలో పదేళ్ల ప్రజా ప్రస్థానంలో భాగంగా పాదయాత్ర ప్రారంభించడానికి ముందు వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆనంతరం ప్రారంభించారు. వందలాదిగా మహిళలు బోనాలతో, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో ప్రజలకు మరింత చేరువై గ్రామాల అభివృద్ధికి కావలసిన వనరులు, తదితర ముఖ్యమైన అంశాలు తెలుసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement