Tuesday, April 30, 2024

సీఎం కేసీఆర్‌ నాయకత్వమే మనందరికి శ్రీరామ రక్ష : మంత్రి జగదీష్‌ రెడ్డి

కాంగ్రెస్‌ పాలనలో మునుగోడులో కరువు తాండవించింది, ప్లోరైడ్ భూతం చుట్టుముట్టింద‌ని.. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే మునుగోడు దశ తిరగి ఫ్లోరైడ్ అంతమైందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. మర్రిగూడెం, గట్టుప్పల్‌ మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వమే మనందరికి శ్రీరామ రక్ష. గులాబీ జెండా నీడలోనే ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు. అందుకే కేంద్రం కేంద్రం సీఎం కేసీఆర్‌ను చూసి ఓర్వడం లేదన్నారు. తెలంగాణపై విషం చిమ్ముతూ బీజేపీ నాయకులు మిడతల్లాగా వచ్చి తెలంగాణాపై దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే కేసీఆర్‌ను ఆపే శక్తి ఎవ్వరికి లేదన్నారు. దేశ ప్రజలు తెలంగాణా సాధించిన విజయాల గురించి మాట్లాడుతున్నరు. అందుకే బీజేపీ నాయకులు కేసీఆర్‌ పేరు వింటేనే బెంబేలెత్తిపోతున్నారు. మునుగోడులో గులాబీ పార్టీ కార్యకర్తలు సైనికులవ లే పని చేయాలని, బీజేపీ కుట్రల్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మునుగోడులో గెలిచేది టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement