Sunday, May 19, 2024

బొమ్మ తుపాకీతో బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

బొమ్మ తుపాకీతో బావమరిది బావ ను బెదిరించిన కేసులో ఒకరి పై కేసు నమోదు చేసినట్లు బసంత నగర్ మహేందర్ తెలిపారు. 2 రోజుల క్రితం రాఘవపూర్ గ్రామానికి చెందిన గాండ్ల సదయ్య ను ఆయన బామ్మర్ది అయినటువంటి మర్కు నవీన్ బొమ్మ తుపాకీతో బెదిరించి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. రాఘవాపూర్ కు చెందిన గాండ్ల సదయ్యా,మార్పు నవీన్ లు ఇద్దరు కలిసి రాఘవపూర్ శివారులో ఇటుక బట్టి వ్యాపారం ను 3 సంవత్సరాల క్రితం ప్రారంభించారని, వ్యాపార లావాదేవీల్లో గొడవలు రావడం వల్ల పెద్దమనుషుల దగ్గర పంచాయతీ చేసుకుని గాండ్ల సదయ్య నవీన్ కు 28 లక్షలు ఇచ్చుటకు ఒప్పందం చేసుకుని ఎనిమిది లక్షల రూపాయలను ఫిబ్రవరి 15న ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వక పోయేసరికి నిందితుడైన నవీన్ ఆన్లైన్లో కొనుగోలు చేసిన బొమ్మ తుపాకీతో బట్టి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు నవీన్ ను అదుపులోకి తీసుకొని అతని వద్దనుండి బొమ్మ తుపాకీ ని ఫోన్ ని స్వాధీనపరచుకోని నోటీసు జారీ చేయడం జరిగిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement