Tuesday, April 30, 2024

ఏరియా ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేయాలి : ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి

యాదాద్రి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని, వైద్య రంగానికి అనేక నిధులు వెచ్చిస్తూ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ… భువనగిరి ఏరియా ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేయాలని కోరారు. రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ… భువనగిరిలో నూతన డయాలసిస్ సెంటర్ ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరారు. భూదాన్ పోచంపల్లి లో శితిలావస్థలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవననాన్ని మంజూరు చేయాలని శాసనసభ సభాపతి ద్వారా ఆర్ధిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావ్ ను కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement