Friday, May 3, 2024

Murder – స‌హజీవనం చేసిన వ్యక్తినే ఖ‌తం చేసిన మ‌హిళ‌

సూర్యాపేట, ప్రభ న్యూస్: సహజీవనం చేసిన వ్యక్తిని ఓ మహిళ అంతమందించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరమ్మ కాలనీకి చెందిన ఉమా నూతనకల్లు మండలం తాళ్ల సింగారం గ్రామానికి చెందిన వెంకటేష్ తో సహజీవనం చేస్తూ ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల మద్యానికి బానిసై తనను ఇబ్బంది పెడుతున్న వెంకటేష్ ను అడ్డుతోలగించుకోవాలని భావించిన ఉమా గ‌త‌ అర్ధరాత్రి చున్ని తో గొంతు నలిమి చంపేసింది.

వెంకటేష్ మృత దేహాన్ని చూసిన ఇరుగు పొరుగు వెంకటేష్ తండ్రి జానయ్య కు సమాచారం ఇవ్వగా పోలీసులకు పిర్యాదు చేశారు. సిఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమా పరారి ఉన్నట్లు చెబుతున్నారు. వెంకటేష్ కు గతంలో వివాహం కాగా మతిస్థిమితం లేని బార్య యశోద, కుమారుడు నవీన్ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement