Monday, April 29, 2024

Breaking: మద్యం మత్తులో ఎమ్మార్వో కుమారుడి డ్రైవింగ్.. ఏడుగురికి తీవ్రగాయాలు

హైదరాబాద్: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కమాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎమ్మార్వో హరికృష్ణ పేరుతో ఉన్నట్లు సమాచారం. ఎల్బీనగర్ – ఉప్పల్ రోడ్ లో వేగంగా దూసుకుపోతున్న కారు రాజీవ్ గాంధీ నగర్ కమాన్ ను ఢీ కొట్టడంతో కారులో ఉన్న ఏడుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

చౌటుప్పల్ ఎమ్మార్వో కుమారుడు సాయి కార్తీక్ తన తండ్రి కారును తీసుకుని తన స్నేహితులతో కలిసి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తుంది. ప్రమాద సమయంలో కారును సాయి కార్తీక్ డ్రైవ్ చేస్తున్నారని సమాచారం. ప్రమాదంలో గాయపడిన నలుగురు యువకులను గాంధీ ఆస్పత్రికి తరలించి, సాయి కార్తీక్ తో పాటు మరో ఇద్దరు యువకులని కొత్త పేట ఓమ్ని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తీవ్ర స్థాయిలో జరగడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులోని యువకులకు తీవ్రగాయాలు కావడంతో అందరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. చైతన్య పురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement