Saturday, May 4, 2024

Maharashtra: నాసిక్-పూణే హైవేపై ఘోర‌ రోడ్డు ప్రమాదం.. ప‌సిబిడ్డ మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. అహ్మద్‌నగర్‌లోని నాసిక్-పూణే హైవేపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. వేగంగా వస్తున్న కార్గో ట్రక్కు కారును ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో కారులోని నలుగురు మృతి చెందారు. మృతుల్లో పసిబిడ్డ కూడా ఉండడం బాధాకరం.

మృతులను ఓజస్వి ధంకర్ (2), ఆశా సునీల్ ధంకర్ (42), సునీల్ ధంకర్ (65), అభయ్ సురేష్ విశాల్ (48)గా గుర్తించారు. ఈ ప్రమాదం ఒకరు గాయాలతో బయటపడ్డారు. గాయాలైన వ్యక్తిని అస్మిత అభయ్ విశాల్‌గా గుర్తించారు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేగంగా వస్తున్న కార్గో ట్రక్ కారును ఢీకొట్టి బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు కావడంతో అకోలే తాలూకాకు చెందిన నలుగురు ప్రయాణికులు మరణించగా.. ఒకరికి గాయాలయ్యాయని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ట్రక్కులో ఇనుప పైపులు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత ట్రక్కులోని ఇనుప పైపులన్నీ రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement