Tuesday, May 14, 2024

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం – ఎంపీపీ పంద్రా

ఉట్నూర్ జూన్ 27( ప్రభ న్యూస్) మృతి చెందిన దేవేందర్ కుటుంబానికి అండగా ఉంటామని ఉట్నూర్ ఎంపీపీ పంద్రా జయవంతరావు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్ భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన దేవేందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

దేవేందర్ కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ధైర్యంగా ఉండాలని అన్నారు. పరామర్శించిన వారిలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దాస0డ్ల ప్రభాకర్, బిఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, లంబాడ జేసి నాయకులు నారాయణ సామాజిక కార్యకర్త అంజద్ ఖాన్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement