Monday, May 6, 2024

ఆర్.బి.ఐ క్విజ్ పోటీలు – ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్ధులు

ఉట్నూర్ జూన్ 27 (ప్రభ న్యూస్) అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం ఆర్బిఐ ఆధ్వర్యంలో ఉట్నూర్ ఎడిసిసి సౌజన్యంతో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎంత జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి పొందగా జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి కేజీబీవీ పాఠశాల విద్యార్థి తృతీయ బహుమతి పొందారు.

మొదటి బహుమతి 5000 రెండవ బహుమతి 4000 మూడో బహుమతి మూడు వేలు రూపాయలను విద్యార్థులకు అందజేస్తున్నట్లు వారికి ప్రశంసా పత్రం లను ఎంఈఓ శ్రీనివాస్ ఏ డి సి సి బ్యాంక్ మేనేజర్ సవిత నాబార్డ్ ఎఫ్ఎల్సి లోక రామ్ రెడ్డి ఏంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు దిలేష్ చవన్ అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ పోటీలో మొదటి బహుమతి పొందిన విద్యార్థులకు జూలై 4న జిల్లా కేంద్రంలో కీచు పోటీలు జిల్లా స్థాయిలో ఉంటాయని తెలిపారు

ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ లిట్రసి కోఆర్డినేటర్ రామ్రెడ్డి ఫీల్డ్ ఆఫీసర్ రంగనాథ్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement