Friday, May 3, 2024

పెట్లబుర్జు ఆస్పత్రి అభివృద్ధికి రూ.50లక్షలు విడుదల చేసిన ఎంపీ సంతోష్ కుమార్

తాను జన్మించిన పెట్లబుర్జ్ దవాఖాన అభివృద్ధికి గతంలో తాను హామీ ఇచ్చిన కోటి రూపాయల్లో.. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మొదటి విడతగా రూ.50 లక్షల మంజూరీ పత్రాన్ని ఈరోజు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా, ఆసుపత్రి సుపరింటెండెంట్ డాక్టర్ పి.మాలతి కి అందజేశారు. తాను హామీ ఇచ్చిన మిగతా రూ.50 లక్షలను వచ్చే ఆర్ధిక సంవత్సరం నిధుల నుండి విడుదల చేస్తానని ఆయన తెలిపారు. పెట్లబుర్జు ఆసుపత్రి అభివృద్ధికి ఎల్లవేళ‌లా అండగా ఉంటానని, తనతో పాటు తన మిత్రులు కూడా ఆసుపత్రి అభివృద్ధికి సహకరించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్ తాను జన్మించిన దవాఖాన అభివృద్ధి పట్ల చూపించిన ఆసక్తి మిగతా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement