Friday, April 19, 2024

బాణ‌సంచాతో వెళ్తున్న ఈ-రిక్షాలో పేలుడు.. ఒక‌రు మృతి

ఈ-రిక్షాలో బాణ‌సంచా నింపి తీసుకెళ్తుండ‌గా ఒక్క‌సారిగా రిక్షా పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందారు.మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం గ్రేట‌ర్ నోయిదాలో జ‌రిగింది. నోయిడాలోని దాద్రీలో రిక్షా నడిపే పప్పు, అతని సహాయకుడు సల్మాన్.. బాణసంచా నింపిన ఈ-రిక్షాను తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికంగా జరిగే జగన్నాథ యాత్రలో కొందరు పటాసులు కాల్చారు. ఆ సమయంలో కొన్ని ఎగిరివచ్చి ఈ-రిక్షాలోని పటాసులపై పడ్డాయి. దాంతో ఒక్కసారిగా రిక్షా పేలిపోయింది. ఎలక్ట్రిక్ వాహనం కావడం, క్రాకర్లు ఎక్కువగా ఉండటంతో బాంబు పేలినట్లుగా కనిపించింది. ఈ ఘటనలో పప్పు, సల్మాన్ తీవ్ర గాయపడ్డారని, వారిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు సల్మాన్ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన అంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఒక్కసారిగా పేలుడు జరగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. ఏమైందో తెలియక చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. పేలుడుకు ముందు రిక్షాలో ఇద్దరు ఉండటం కనిపించింది. పటాసులన్నీ పక్క దుకాణాలపై చెల్లాచెదరుగా పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement