Saturday, April 27, 2024

కార్పొరేటర్ ప్రమాణ స్వీకరానికి హాజరైన రేవంత్

హైదరాబాద్ లోని లింగోజిగూడ డివిజన్‌కు నుంచి గెలిచిన కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పేల్లి రాజశేఖర్ రెడ్డితో మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో నూతన పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ ఎంపికైన రేవంత్ రెడ్డికి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌త రెడ్డి, ప‌లువురు కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు.

కాగా, గత డిసెంబర్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందడంతో ఉప ఎన్నిక జ‌రిగింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్థిపై 1272 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు.

ఇదీ చదవండి: వస్తూనే ఉత్త‌మ్‌కు రేవంత్ షాక్! హుజురాబాద్ లో కొత్త‌ అభ్య‌ర్థి?

Advertisement

తాజా వార్తలు

Advertisement