Sunday, May 5, 2024

హైకోర్టుకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి.. ఎందుకంటే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న పట్టించుకోమంటూ ఆరోపణలను ఎదుర్కున్న గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వెంకట్రామిరెడ్డి హైకోర్టుకు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పారు. దీంతో ఆయనపై నమోదైన కేసు విచారణను ముగిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. వరి సాగు చేయోద్దంటూ, వ్యాపారులెవరూ వరి నిత్తనాలను అమ్మొద్దంటూ మౌఖిక ఆదేశాలిచ్చారన్న ఆరోపణలతో పాటు కోర్టుకు ధిక్కరించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. సోమవారం కేసు విచారణ సందర్భంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డి తాను సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యల అభియోగాలపై బే షరతుగా హైకోర్టుకు లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement