Monday, April 29, 2024

నూతన వధూవరులకు ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులు

.ఎల్బీనగర్, సెప్టెంబర్ 3 (ప్రభ న్యూస్).ఎల్బీనగర్ నియోజకవర్గం బారాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ బి ఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న దంపతుల కుమారుడు రంజిత్ గౌడ్ – హేమలత ల వివాహ మహోత్సవం వేడుక మన్సూరాబాద్ కే బీ ఆర్ కన్వెన్షన్ లో అదివారం అంగరంగవైభవంగా జరిగింది . ఈ వేడుకలకు శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వేడుకలతో అంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి జోగి రమేష్ , డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ , మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంత రావు , మధుయాష్కీ , డా . బూరనర్సయ్య గౌడ్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు , మంచిరెడ్డి కిషన్ రెడ్డి , జైపాల్ యాదవ్ , శాసనమండలి సభ్యులు ఎగ్గే మల్లేశం కురుమ , పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు , కార్పోరేటర్లు , మాజీ కార్పోరేటర్లు బీ అర్ స్ పార్టీ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు , కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిథులు , ప్రజలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement