Tuesday, May 14, 2024

Mlc Kavitha:లక్ష్మీ నరసింహస్వామి సేవ‌లో ఎమ్మెల్సీ కవిత

ధర్మపురి లోని శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్ర‌త్యేక‌ పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేదభూమి అయిన ధర్మపురి క్షేత్రం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, స్వామి వారి దయ అందరిపై ఉండాలని ప్రార్థించానని ఆమె తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement