Sunday, May 5, 2024

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెడ‌తాన‌న్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీల్లోని సంక్షేమ సంఘాల ప్రతినిధులు బుధవారం ఎమ్మెల్యే ను కలిసి ఆయా సమస్యలపై వినతులు సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… సమస్యలపై ఎప్పటికప్పుడు సంక్షేమ సంఘాల సభ్యులను, స్థానికులను కలిసి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తూనే ఉన్నానన్నారు. పెండింగ్ సమస్యలు, అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ నిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement