Thursday, May 16, 2024

సంక్షేమ సంఘ భవనాలను కాలనీవాసులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి..

ఎల్బీనగర్ ఆగస్టు 16 ( ప్రభ న్యూస్). కాలనీవాసులు సంఘటితంగా ఉంటూ సంక్షేమ సంఘ భవనాలను సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీ లోని సంక్షేమ సంఘ భవనం రెండవ అంతస్తు నిర్మాణానికి 40 లక్షల మంజూరైన నిధులతో బుధవారం కార్పొరేటర్ పవన్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గన్ని ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కాలనీ భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ సరిపోక లీకేజీలతో ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని యూజీడి పైప్ లైన్ సైజు పెంచేలా చర్యలు తీసుకుని సమస్యకు పరిష్కారం చూపుతానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీ గౌరవాధ్యక్షులు తీగుల్ల యాదగిరి. ప్రధాన కార్యదర్శి వనం నర్సింహ, సీనియర్ సిటిజన్ ఇంచార్జి ఎం. సాంబయ్యగౌడ్, మహేష్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, ఎం. శివకుమార్, భూషణం, జగన్మోహన్ రెడ్డి, సంజీవరెడ్డి ,చంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, శశిధర్ రెడ్డి ,కిరణ్ గౌడ్, నరసింహ చారి, చంద్రయ్య ,ఎం.ఎన్.రెడ్డి, కాలనీవాసులు ,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement