Monday, May 6, 2024

Big Breaking: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న చనిపోయారు. ఎమ్మెల్యే సాయన్న గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో ఆయనను యశోద ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. కాసేపటి క్రితమే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కంటోన్మెంట్ ప్రజలు శోకసంద్రంలో మునిగారు.

1951 మార్చి 5న సాయన్న జన్మించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి సాయన్న విజయం సాధించారు. 1994లో టీడీపీ నుండి సాయన్న రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టీడీపీ అభ్యర్ధిగా సాయన్న తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాయన్న టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే సాయన్నకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement