Sunday, May 5, 2024

గాయపడిన కూలీలకు ఎమ్మెల్యే సండ్ర భరోసా

ఖమ్మం జిల్లా కప్పలబంధం గ్రామానికి చెందిన 20 మంది కూలీలు లక్ష్మీపురం గ్రామానికి పనికి వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి ట్రక్కు బోల్తా పడడంతో గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, డాక్టర్లకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. అధైర్య పడవద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయాలు పాలైన పలువురికి ఆర్థిక సహాయం చేసి అధైర్య పడవద్దని మనోధైర్యాన్ని ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement