Thursday, May 2, 2024

గుజ‌రాతీ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న ‘ప్ర‌కాశ్ రాజ్’

ర‌త‌న్ జైన్ నిర్మించిన ఒక గుజ‌రాతీ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ప్ర‌కాశ్ రాజ్ సొంతం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఉమాంగ్ వ్యాస్ దర్శకత్వం వహించిన గుజరాతీ సినిమా ‘డియర్ ఫాదర్’ ఈ రోజునే భారీ స్థాయిలో విడుదలైంది. పరేష్ రావెల్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. 40 ఏళ్ల తరువాత ఆయన చేసిన గుజరాతీ సినిమా కావడంతో అక్కడ అందరిలో ఆసక్తి నెలకొంది. వయసుమళ్లిన ఒక వ్యక్తి .. అతని కొడుకు .. కోడలు మధ్య నడిచే కథ ఇది. హీరోకి యాక్సిడెంట్ కావడంతో పోలీస్ విచారణ మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్ కూడా కథానాయకుడి మాదిరిగానే ఉండటంతో కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. ఈ కథ గురించి తెలియగానే ప్రకాశ్ రాజ్ పోటీపడి ఈ సినిమా దక్షణాది రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement