Monday, April 29, 2024

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు వైద్య పరీక్షలు

ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 6వ రోజుకు చేరింది. నేడు ముదిగొండ మండలం బాణాపురంలో భట్టి పాదయాత్ర ప్రారంభమైంది. గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అపోలో టెలీ క్లినిక్ ఆస్పత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో భట్టి విక్రమార్కకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. బిపి పరిశీలించారు. భట్టి సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం గ్రామంలో పాదయాత్ర సందర్భంగా మహిళా కాంగ్రెస్ నేతలు హారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా ప్రజలు తమ సమస్యలను సీఎల్పీ నేతకు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement