Tuesday, May 14, 2024

బీజేపీ నేత‌ల‌కు ద‌మ్ముంటే సీసీఐ తెరిపించాలి : మంత్రి హ‌రీశ్ రావు

రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు ఆదిలాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఆదిలాబాద్‌ పర్యటనలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి సీసీఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు దమ్ముంటే సీసీఐ తెరిపించాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు. సీసీఐ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. సీసీఐ పునరుద్ధరిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రాయితీలు కల్పిస్తామన్నారు. కేంద్రానికి చేతకాకపోతే రాష్ట్రానికి అప్పగించాలని తెలిపారు. సీసీఐ కోసం చేస్తున్న ఆందోళనకు టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement