Monday, May 6, 2024

గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య

గోషామ‌హాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైని క‌లిశారు. అయితే తన భర్తపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని, వీటిపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్‌కు ఉషాభాయి వినతి చేశారు. తన భర్తపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ సతీమణి గతకొద్దిరోజులుగా న్యాయం చేయాలంటూ అటు కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్‌‌తో పాటు అవకాశం ఉన్న ప్రతీ చోట ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గవర్నర్‌ను కలిసిన ఉషాభాయి… తన భర్తపై కేసులు ఎత్తివేయాలని లేఖ అందజేశారు. ఇంకోవైపు ప్రభుత్వం చెబుతున్నట్లు వంద కేసులు తన భర్తపై లేవని, అవన్నీ ప్రజాకోర్టులో కొట్టేసినవే అని తెలిపారు. ప్రభుత్వం ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాసేలా వ్యవహరిస్తోందని, దాన్ని ప్రశ్నించిన రాజాసింగ్‌పై తప్పుడు కేసులు పెట్టిందని రాజాసింగ్ సతీమణి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement