Wednesday, May 15, 2024

హిజ్రాల సమస్యలు పరిష్కరిస్తాం.. అండగా ఉంటానన్న ఎమ్మెల్యే నన్నపునేని

రాష్ట్రంలోని హిజ్రాలందరికి మేలు జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ ఉర్సు బైపాస్ రోడ్డులో హిజ్రా సంఘం నాయకురాలు లైలా ఆద్వర్యంలో తెలంగాణ హిజ్రా సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై ఆయన మాట్లాడుతూ హిజ్రాల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహాయ సహాకారాలు అందిస్తామన్నారు. హిజ్రాలకు నియోజకవర్గంలో పట్టాలు అందజేసామని,వారికి ప్రభుత్వం ఇండ్లు నిర్మించుకునేందుకు అందించే సాయాన్ని కూడా అందజేస్తామన్నారు. హిజ్రాలు ఆత్మగౌరవంతో బ్రతికేలా ప్రభుత్వం తరపున తోడ్పాటునందిస్తామన్నారు. వారికి పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాది కల్పించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేను హిజ్రాలు సన్మానించి,కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement