Tuesday, May 14, 2024

శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వ విప్

తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీనివాసుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో – ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. స్వామి దివ్య ఆశీస్సులతో  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. భవిష్యత్ తరాలకు బంగారు తెలంగాణ అందించేలా కేసీఆర్కి టిఆర్ఎస్ ప్రభుత్వానికి దేవదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి భగవంతుని కోరుకున్నాట్లు వినయ్ భాస్కర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement