Monday, April 29, 2024

ఆటోలో టీ తాగుతూ ముచ్చ‌ట్లు పెట్టిన – మంత్రి కొడాలి నాని, వంగ‌వీటి రాధా

ఓ ఆటోలో కూర్చుని టీ తాగుతూ క‌నిపించారు మంత్రి కొడాలి నాని..వంగ‌వీటి రాధా. కాగా వారిద్ద‌రూ ఆటోలో కూర్చుని మ‌రీ ఏం మాట్లాడుకుంటున్నార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు ఇలా టీ తాగుతూ.. ఆటోలో కూర్చొని మాట్లాడుకోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోసారి వంగవీటి రాధా పార్టీ మారే అంశం తెరమీదకు వచ్చింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వంగవీటి రాధా టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ టీడీపీ నేతలు ఆయనతో ఇంత కలుపుగోలుగా ఉండటం అరుదనే చెప్పాలి. రాధా కూడా కొడాలి నానితో ఉన్నంత సన్నిహితంగా టీడీపీ నేతలతో ఉండరని టీడీపీ శ్రేణులే చెబుతుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement