Friday, May 3, 2024

గణపతి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో గణపతి హోమం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం అయ్యప్ప పడిపూజ సందర్భంగా దేవాలయంలో తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన గణపతి హోమంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాల దారులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement