Tuesday, May 7, 2024

పేదలకు వరం సీఎంఆర్ఎఫ్

నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 45 మంది లబ్ధిదారులకు 21 లక్షల 76 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సంబంధిత రసీదు లతో దరఖాస్తు చేసుకున్న వారికి సీఎంఅర్ ఎఫ్ ద్వారా చేయూత నీస్తున్నామన్నారు. గత ఏడేళ్లుగా నియోజకవర్గంలోని వేలాది మందికి కోట్లాది రూపాయలు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెల్లించామన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత తమ ప్రభుత్వం ద్యేయ, ఇందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement