Friday, April 26, 2024

Breaking : స‌ర్పంచ్ పై కాల్పులు – ఆస్ప‌త్రికి త‌ర‌లించిన స్థానికులు

స‌ర్పంచ్ పై ఇద్ద‌రు వ్య‌క్తులు కాల్పులకి తెగ‌బ‌డ్డారు. ఈ సంఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లా రామ‌చంద్రాపురంలో చోటు చేసుకుంది. రామ‌చంద్రాపురం స‌ర్పంచ్ వెంక‌ట‌ర‌మ‌ణ వ‌ద్ద‌కు ఓ మ‌హిళ వెళ్లింది. మ‌ధురాన‌గ‌ర్ లోని స‌ర్పంచ్ కార్యాల‌యం వ‌ద్ద వెంక‌ట‌ర‌మ‌ణ ఉన్నారు. ఆ మ‌హిళ‌తో పాటు మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా స‌ర్పంచ్ వ‌ద్ద‌కు వెళ్ళారు. మ‌హిళ , స‌ర్పంచ్ తో మాట్లాడుతున్న స‌మయంలో అదును చూసుకుని ఆమె వెంట వ‌చ్చిన ఇద్ద‌రు కాల్పులు జ‌రిపారు. దాంతో స‌ర్పంచ్ కు తీవ్ర‌గాయాలు అయ్యాయి. కాల్పులు జ‌రిపిన వెంట‌నే దుండ‌గులు అక్కడ నుండి పారిపోయారు. స్థానికులు స‌ర్పంచ్ ను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. అక్క‌డ రెండు బుల్లెట్ల‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసుపై ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుపుతున్నారు. కాల్పులు జ‌రిపింది ఎవ‌రా అని ఆరా తీస్తున్నారు పోలీసులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement