Sunday, May 5, 2024

రాజీవ్​ రహదారిపై భారీ వరద, వాహనాల రాకపోకలకు ఇబ్బంది.. పరిశీలించిన ఎమ్మెల్యే దాసరి

ఆదివారం రాత్రి పదిన్నర గంటల స‌మయం.. భారీ వర్షాలతో రహదారిపై వరద నీటిని పరిశీలించి రక్షణ చర్యలు తీసుకోవాల‌ని సూచించారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తుండ‌డంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సూచించారు. అర్ధరాత్రి కావస్తున్నా వరద ఉధృతిని వర్షంలో పరిశీలిస్తున్న ఎమ్మెల్యేను చూసి వాహనదారులు రాత్రింబవళ్లు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement